తెలుగు ప్రేక్షకులకు 'మాతంగి' చిత్రం తప్పకుండా నచ్చుతుంది - ప్రముఖ హీరోయిన్‌ రమ్యకృష్ణ



























తెలుగు ప్రేక్షకులకు 'మాతంగి' చిత్రం తప్పకుండా నచ్చుతుంది
-
ప్రముఖ హీరోయిన్రమ్యకృష్ణ

'
బాహుబలి'లో శివగామి క్యారెక్టర్లో అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్చేసిన రమ్యకృష్ణ తాజాగా 'మాతంగి' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస విజువల్స్ప్రై.లి. పతాకంపై కన్నన్తామరక్కుళం దర్శకత్వంలో రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్‌ 'మాతంగి' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రమ్యకృష్ణ, జయరాం, సంపత్‌, కళాభవన్మణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మలయాళంలో సూపర్డూపర్హిట్గా నిలిచింది. చిత్రాన్ని తెలుగులో ఎస్‌.వేణుగోపాల్‌, సజ్జు రిలీజ్చేస్తున్నారు. చిత్రం తెలుగు శాటిలైట్హక్కులు భారీ మొత్తంలో అమ్ముడై సెన్సేషన్సృష్టించింది. బిజినెస్పరంగా చిత్రానికి అన్ని ఏరియాల నుండి క్రేజీ బిజినెస్జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని చిత్రం డిసెంబర్‌ 15 గ్రాండ్గా రిలీజ్అవుతుంది. సందర్భంగా 'మాతంగి' థియేట్రికల్ట్రైలర్ని డిసెంబర్‌ 4 హైదరాబాద్ప్రసాద్ప్రివ్యూ థియేటర్లో రిలీజ్చేశారు. కార్యక్రమంలో రమ్యకృష్ణ, ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి, చిత్ర నిర్మాత వినయ కృష్ణ వేదిక పై పాల్గొనగా రమ్యకృష్ణ ముద్దుల తనయుడు రుత్విక్సెంటర్ఆఫ్ఎట్రాక్షన్గా నిలిచాడు
ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ - ''వినయ వెరీ బిగ్క్రిటిక్‌. బేసిగ్గా తనకి కథలు చెప్పినా త్వరగా నచ్చవు. అలాంటిది సినిమా కథ నచ్చి తెలుగులో 'మాతంగి' రిలీజ్చేస్తున్నారు. రమ్యకృష్ణ క్యారెక్టర్చేసినా తను తప్ప ఇంకెవరూ చెయ్యలేరు అనేంతగా క్యారెక్టర్లో ఇన్వాల్వ్అయి చేస్తారు. నాకు రమ్యకృష్ణగారి 'అమ్మోరు' చాలా ఇష్టం. 'మాతంగి' ట్రైలర్చూస్తుంటే 'అమ్మోరు' షేడ్స్కన్పిస్తున్నాయి. అమ్మవారి క్యారెక్టర్లో రమ్యగారి ఎక్స్ప్రెషన్స్చూస్తుంటే నిజంగా దేవతని చూసిన ఫీల్కలిగింది. సినిమా పెద్ద హిట్అయి నిర్మాతగా వినయ సక్సెస్కావాలి. టీమ్అందరికీ ఆల్ది బెస్ట్‌'' అన్నారు
ప్రముఖ హీరోయిన్రమ్యకృష్ణ మాట్లాడుతూ - ''శ్రీనివాస విజువల్స్బేనర్లో కొన్ని సీరియల్స్చేసాం. ఫస్ట్టైమ్ఒక చిన్న ప్రయత్నంగా సినిమా చేస్తున్నాం. హర్రర్‌, కామెడీ, ఎమోషన్స్అన్నీ చిత్రంలో వున్నాయి. చిత్రంలో రెండు డిఫరెంట్షేడ్స్లో నటించాను. ముఖ్యంగా 'అమ్మోరు' షేడ్స్వున్న క్యారెక్టర్చాలా ఇంట్రెస్టింగ్గా వుంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చిన్న ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. డిసెంబర్‌ 15 చిత్రం గ్రాండ్గా రిలీజ్అవుతుంది. సినిమా రిలీజ్విషయంలో మాకు సపోర్ట్చేస్తున్న వేణుగోపాల్‌, సజ్జుగారికి నా థాంక్స్‌'' అన్నారు
రమ్యకృష్ణ, జయరాం, సంపత్‌, కళాభవన్మణి, వీణా నాయర్‌, బేబి అక్షర, కిషోర్తదితరులు నటించిన చిత్రానికి సంగీతం: రతీష్వేగ, ఆర్ట్‌: సాహస్బాల, దర్శకత్వం: కన్నన్తామరాక్కుళం, నిర్మాత: వినయ కృష్ణన్‌.
Previous
Next Post »