యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌.



యంగ్రెబల్స్టార్ప్రభాస్‌....ఆరడుగుల హైట్‌, హైట్కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్‌, అందరినీ ప్రేమగా డార్లింగ్అని పిలుస్తూ, అందరికీ దగ్గరైన టాలీవుడ్డార్లింగ్‌. రెబల్స్టార్కృష్ణంరాజు నటవారసుడుగా 'ఈశ్వర్‌' చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. 'రాఘవేంద్ర', 'వర్షం', 'అడవిరాముడు', 'చక్రం', 'ఛత్రపతి', 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా' 'బుజ్జిగాడు' 'బిల్లా', 'ఏక్నిరంజన్‌', 'డార్లింగ్‌', 'మిస్టర్పర్ఫెక్ట్‌', 'రెబల్‌', 'మిర్చి' వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నీ వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్రెబల్స్టార్ప్రభాస్‌. అయితే రెండేళ్ల క్రితం విడుదలైన 'బాహుబలి ది బిగినింగ్‌', ఏడాది ఏప్రిల్లో విడుదలైన 'బాహుబలి 2'తో తిరుగులేని క్రేజ్ను తన సొంతం చేసుకున్నారు. రెండు పార్టుల కోసం ప్రభాస్పడ్డ కష్టం మాటల్లో చెప్పలేని. అనుకున్న లక్ష్యాన్ని రీచ్అవడానికి వేసిన ప్రతి అడుగులో కృషి, పట్టుదల, దీక్ష.. ప్రభాస్ని కోట్లాది మందికి చేరువ చేశాయి
బాక్సాఫీస్బాహుబలి.. 
బాహువుల్లో అమితమైన బలవంతుడు, గొప్ప పరాక్రమవంతుడు అమరేంద్ర బాహుబలి. ఇలాంటి నాయకుడిని తెరపై ఆవిష్కరించాలంటే తేలికైన విషయం కాదని రాజమౌళికి తెలుసు. కథను సిద్ధం చేసుకోగానే ప్రభాస్ను కలిసి కథ చెప్పాడు. అంతా ఓకే అయ్యింది. రెండేళ్లలో బాహుబలి ప్రాజెక్ట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే రేండేళ్లు కాస్తా ఐదేళ్లయ్యింది. ఐదేళ్ల వరకు మరో ప్రాజెక్ట్గురించి ఆలోచించకుండా కమిట్మెంట్తో సినిమా చేయడమంటే మరో హీరో ఎవరైనా ఎందుకా అని ఆలోచించేవారు. కానీ ప్రభాస్మాత్రం ఆలోచించలేదు. ఐదేళ్లు బాహుబలి గురించే తపన పడ్డారు. మరో సినిమా చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన తపన, రాజమౌళి కృషి కలయికే బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేయడమే కాదు, ఏకంగా తెలుగు సినిమా మార్కెట్ను ఆకాశమే హద్దు అనేలా చేసింది. ప్రభాస్అభిమానులు, ప్రేక్షకులు అమరేంద్ర బాహులి, మహేంద్ర బాహుబలి స్థానంలో ఇంకెవర్నీ ఊహించలేంటూ ముక్త కంఠంతో కలెక్షన్స్రూపంలో బదులిచ్చారు...అది కూడా రికార్డుల రూపంలో బాహుబలి రెండు భాగాలు కలిపి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందంటే సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. బాహుబలి రిలీజ్ముందు వరకు తెలుగు సినిమా మార్కెట్ వందకోట్లు ఉంటే..రిలీజ్తర్వాత రేంజ్పాతిక రెట్లు పెరిగింది. దక్షిణాది సినిమా అంటే చిన్నచూపు చూసే ఉత్తరాదివారిని నోర్లు వెళ్లబెట్టేంత కలెక్షన్స్కుంభవృష్టిని కురిపించింది. సినిమా విడుదలైన ప్రతిచోట కళ్లు తిరిగే వసూళ్లును రాబట్టుకుంది. ఏడాది వచ్చిన బాహుబలి 2 తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఒక్కొక్క దగ్గర వందకోట్లకు పైగా రాబట్టిన చిత్రం దక్షిణాదిన మాత్రమే దాదాపు 700 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అలాగే ఉత్తరాదిన 520 కోట్ల రూపాయలను కలెక్ట్చేసింది. మిగిలిన దేశాల్లో కలెక్షన్స్అంతా చూస్తే రెండో పార్ట్మాత్రమే 1700 కోట్లను రాబట్టుకుంది. బాహుబలి మొదటి భాగం 700 కోట్లరూపాయలను వసూలు చేసింది. దీంతో ప్రపంచ సినిమాయే తెలుగు సినిమాకు ఇంత పెద్ద మార్కెట్ఉందా? అసలు బాహుబలి సినిమా ఏంటి? ఎవరీ ప్రభాస్‌? అని అందరూ డిస్కస్చేసుకునేలా చేసిన బాక్సాఫీస్బాహుబలి మన యంగ్రెబల్స్టార్ప్రభాస్‌. బాహుబలి సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్లో తెలుగు సినిమా స్థాయి, మార్కెట్పెరిగింది. అంతర్జాతీయంగా చైనా సహా పలు దేశాల్లో చిత్రం సూపర్సక్సెస్ను సాధించింది. బాహుబలి వరకు ప్రభాస్తెలుగు హీరో. బాహుబలి2కి ఇంటర్నేషల్హీరో అయ్యారు. రాజమౌళి టేకింగ్‌, ప్రభాస్యాక్టింగ్కలవడంతో సినిమా సెన్సేషన్స్కు కొదవలేకుండా పోయింది. పలు దేశాల్లో చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్హీరో అయ్యారు. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. యూనివర్సల్హీరోగా ప్రభాస్ఎంతటి ఖ్యాతిని సంపాదించుకున్నారు మన డార్లింగ్ప్రభాస్‌. ఒకప్పుడు బాలీవుడ్లో తెలుగు సినిమా అంటే చిన్నచూపు చూసేవారు. కానీ ఇప్పుడు ప్రభాస్నటనకు బాలీవుడ్ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్ను హిందీలో నటించమని ఫ్యాన్సీ ఆఫర్స్ప్రకటించడం అతనికి వున్న ఫాలోయింగ్ని తెలియజేస్తుంది. బాహుబలి సినిమా విడుదల వేరే భాషల్లో కూడా ప్రభాస్కు ఆదరణ పెరగడంతో తెలుగులో కమర్షియల్గా యావరేజ్సక్సెస్ను సాధించిన సినిమాలు కూడా సోషల్మీడియాల్లో, డబ్బింగ్వెర్షన్స్లో సూపర్హిట్చిత్రాలుగా ఎక్కువమంది వ్యూవర్స్చూసిన చిత్రాలుగా నిలిచాయి
అంతర్జాతీయ గుర్తింపు..అరుదైన గౌరవం 
భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్లో మేడవ్ టుస్సాడ్స్మ్యూజియంలో ప్రతిష్టించారు. ప్రభాస్ప్రతిమను యదాతధంగా రూపొందించడానికి మేడమ్టుస్సాడ్మ్యూజియం నుండి వచ్చిన కళాకారులు ప్రభాస్ను కలిసి హైదరా బాద్లో కలిసి 350 ఛాయాచిత్రాలను, ఆయన శారీరక కొలతలను తీసుకుని, బాహుబలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి అదే పేరుతో మేడమ్టుస్సాడ్మ్యూజియంలో ప్రతిష్టించారు. ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన మైనపు ప్రతిమ మేడమ్టుస్సాడ్మ్యూజియంలో మార్చ్‌ 2017 నుండి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. 2016 ఏప్రిల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపు విగ్రహ ప్రతిష్ట తర్వాత, గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్నిలిచారు. ఇప్పుడు ప్రభాస్జాతీయ స్థాయి నటుడిగా ఎదగడంతో పాటు, అనేక మంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు
అందరి చూపు..'సాహో' వైపే 
బాహుబలితో యంగ్రెబల్స్టార్ప్రభాస్రేంజ్మారిపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్తో యువి క్రియేషన్స్సుజీత్దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 150 కోట్ల భారీ బడ్జెట్తో 'సాహో' చిత్రాన్ని హై టెక్నికల్వేల్యూస్తో నిర్మిస్తుంది. అల్రెడి విడుదలైన సినిమా టీజర్‌, ప్రభాస్లుక్స్ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను నెలకొనేలా చేశాయి. ప్రభాస్ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని సినిమా మేకింగ్కోసం నిర్మాతలు ఎక్కడా తగ్గడం లేదు. యాక్షన్థ్రిల్లర్లో కోసం హాలీవుడ్స్టంట్మాస్టర్స్తో పాటు బాలీవుడ్మ్యూజిక్డైరెక్టర్స్శంకర్ఎహ్సాన్లాయ్లు పనిచేస్తున్నారు. బాలీవుడ్హీరోయిన్శ్రద్ధాకపూర్హీరోయిన్గా నటిస్తుంది. ప్రభాస్పుట్టినరోజు సందర్భంగా 'సాహో' మూవీ మేకింగ్వీడియో, ఫస్ట్లుక్ను విడుదల చేస్తుంది చిత్ర యూనిట్‌. ఇప్పుడు ప్రభాస్టాలీవుడ్హీరో కాదు.. ఆల్ఇండియా స్టార్‌. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా నిర్మాణం జరుపుకోనున్నాయి. ఇటు యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్తో పాటు మాస్ఆడియెన్స్లో కూడా ప్రభాస్ఇమేజ్అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా 'డార్లింగ్‌' అని పలకరించే ప్రభాస్ని అందరూ ఎంతో ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ వర్క్చేయాలనుకుంటారు. అలాంటి యంగ్రెబల్స్టార్ప్రభాస్పుట్టినరోజు అక్టోబర్‌ 23. సందర్భంగా యంగ్రెబల్స్టార్ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Previous
Next Post »